ఎన్టీఆర్ కు టీడీపీ బాధ్యతలు ఇవ్వాల్సిందే – లక్ష్మి పార్వతి

-

ఎన్టీఆర్‌ కు టీడీపీ బాధ్యతలు ఇవ్వాల్సిందేనని నందమూరి లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నందమూరి లక్ష్మి పార్వతి..తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి లక్ష్మి పార్వతి మాట్లాడుతూ, సియం జగన్ పరిపాలన ఎంత బాగుందో…శ్రీవారి ఆలయ నిర్వహణ కూడా అంతే బాగుందన్నారు.

ఎంత మంది కలసి వచ్చినా జగన్ ని ఎదిరించలేరన్నారు లక్ష్మి పార్వతి. నారా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించేందుకు జూనియర్ ఎన్టీఆర్‌ సిద్దంగా లేరని ఆగ్రహించారు. ఎన్టీఆర్‌కు నాయకత్వ భాధ్యతలు అప్పగిస్తే టిడిపిలోకి రావచ్చని… ఎన్టీఆర్‌ టిడిపిలోకి వచ్చిన తరువాత నేను స్పందిస్తానని నందమూరి లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news