గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన ప్రకాష్ రాజ్

-

తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా ఈ రోజు తన పుట్టినరోజు పురస్కరించుకుని షాద్ నగర్ వద్ద గల తన వ్యవసాయ క్షేత్రంలో  సినీ నటుడు ప్రకాష్ రాజ్ మొక్క నాటారు. ఈ సందర్భంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్  మాట్లాడారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుందని ప్రతి ఒక్కరు తమ జీవితంలో గుర్తుండిపోయేలా తమ పుట్టినరోజు, పెళ్లిరోజున మొక్కలు నాటుతు పర్యావరణానికి మేలు చేస్తున్నారని ప్రకాష్ రాజ్ అన్నారు..ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటెలా ప్రోత్సహిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ని అభినందించారు.

గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలన్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలన్న ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ప్రకాష్ రాజ్ కోరారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని ఆయన సూచించారు. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news