వైసీపీ నేతలను ఉరి తీయాలి : నారా లోకేష్ సంచలనం

-

వైసీపీ నేతలను ఉరి తీయాలని తెలుగు దేశం పార్టీ కీలక నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అయ్యన్నపాత్రుడు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తున్నారని వైసీపీ పై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు చెప్పే అబద్ధాలు.. మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వేయాలని డిమాండ్‌ చేశారు.

ఉచ్ఛ నీచాలు మరచి వైసీపీ నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయని చెప్పారు. వైసీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలపై కేసులు పెడితే పోలీసులు కనీసం స్పందించడం లేదని ఆగ్రహించారు. జిల్లాలు దాటి మరీ టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయడానికి రావడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అని నిప్పులు చెరిగారు నారా లోకేష్‌.

పోలీసుల చొక్కా పట్టుకొని తిడుతున్న మంత్రులు,బీరు బాటిళ్లు పగలగొట్టి ఏం పీకుతారని సవాల్ చేస్తున్న వైసీపీ నేతలపై పోలీసులు తమ ప్రతాపాన్ని ఎందుకు చూపడం లేదో..? అని నిలదీశారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడితే కనీసం వేసుకున్న ఖాకీ గౌరవాన్ని నిలబెట్టినవారవుతారని చెప్పారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news