భర్తను వదిలి… 22 ఏళ్ల యువకుడితో లేచిపోయిన భార్య

-

మైనర్ గా ఉన్నప్పుడే పెళ్లి చేశారు. ఆతరువాత వేరే వ్యక్తితో ప్రేమలో పడింది. భర్తను విడిచి తన ప్రియుడితో లేచిపోయింది. భర్త ఎంతో ప్రయత్నిస్తే తప్పా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఘటన రాజస్థాన్ దౌల్​పుర్​లోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తన 45 ఏళ్ల భర్తను వదిలి 22 ఏళ్ల యువకుడితో లేచిపోయింది ఓ 16 ఏళ్ల బాలిక. మైనర్ గా ఉన్న సయయంలోనే సదరు బాలికను ఆమె వయసులో చాలా పెద్దగా ఉన్న వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి తరువాత ఓ కూతురుకు జన్మించించి. 

ఇదిలా ఉంటే తన సమీప బంధువుతో ఆ బాలిక ప్రేమలో పడింది. మధ్యప్రదేశ్ కు చెందిన సదరు బాలిక 22 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తితో గతేడాది సెప్టెంబర్ లో  పారిపోయింది. దీంతో ఆమె భర్త చాలా చోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. అయితే తన అడ్రస్ తెలియకుండా ఉండేందుకు ఏకంగా 25 సిమ్ కార్డులను మార్చింది. అయితే ఇటీవల ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంలో సదరు బాలికను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తన భర్తతో కలిసి ఉండేది లేదని… విడాకులు కావాాలని కోరింది. అయితే మైనర్ కావడంతో ఛైల్డ్ వెల్ఫేర్​ కమిటీ సభ్యుల ముందు ప్రవేశపెట్టారు. బాలిక తల్లిదండ్రులను పిలిచి తల్లి, పాప పరిస్థితి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news