సీఎం కేసీఆర్‌పై ‘మహా’ రైతులు ఆగ్రహం

-

మహారాష్ట్ర రైతులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి పేరుతో తమ రాష్ట్రంలో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు అక్కడి రైతులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి, మహారాష్ట్ర లోని గడ్చిరెల్లి జిల్లా గోదావరి సరిహద్దు గ్రామాల రైతులు భూములు ముంపునకు గురవుతున్నాయని అన్నారు వారు. తమను మోసం చేసి తెలంగాణలో దశాబ్ధి ఉత్సవాలు జరుపుకోవడంపై సీఎం కేసీఆర్ పై అక్కడి రైతులు ఆగ్రహమా వ్యక్తపరిచారు.

Evening brief: KCR's office says he's unwell as Telangana CM skips PM Modi  event | Latest News India - Hindustan Times

కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర రైతులకు చెందిన విలువైన భూములు తీసుకొని, ప్రతి ఏటా వందలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగి తీవ్రంగా నష్టపోయామన్నారు మహారాష్ట్ర రైతులు. వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా కూడా పట్టించుకోలేదని వారు మండిపడ్డారు. ఈ నేపధ్యం లో మహారాష్ట్ర రైతులు గడ్చిరెల్లి జిల్లా గోదావరి సరిహద్దు గ్రామాల రైతులు సిరోంచలో 43 రోజుల నుంచి మహారాష్ట్ర రైతులు రిలే నిరాహార దీక్షచేశారు. మహారాష్ట్ర సీఎం రైతులకు అండగా ఉంటామని ప్రకటించి .. ముంపునకు గురైన రైతుల భూములకు 28 కోట్ల రూపాయిలు మంజూరు చేయడంతో రిలే నిరాహార దీక్షను ఈ రోజు ( జూన్ 7) విరమించి .. హర్షం వ్యక్తం చేసిన రైతులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news