రాజకీయ సన్యాసం తీసుకుంటా – మంత్రి మల్లారెడ్డి ఓపెన్ ఛాలెంజ్

-

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించి బండి సంజయ్ కు ఆయన సవాల్ విసిరారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇలాంటివి ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినట్లు చూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏ రాష్ట్రానికి రమ్మన్నా తాను వస్తానని, తెలంగాణలో రైతులకు ప్రభుత్వం చేస్తున్నంత మేలు ఏ రాష్ట్రంలోనైనా చేస్తున్నట్లు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతులకు ఏడాదికి ఎకరానికి రూ. 10,000 రైతుబంధు, రూ. 5 లక్షల రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు అందిస్తున్నారని మల్లారెడ్డి తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో రైతుల కోసం తెలంగాణలో చేసినట్లు చేస్తున్నారా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news