కేసీఆర్ టైమ్ ​అయిపోయింది : మాణిక్‌ రావ్‌ ఠాక్రే

-

మరోసారి సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన
గాంధీభవన్‌లో రాజీవ్​గాంధీ యూత్​క్విజ్​కాంపిటేషన్​పోస్టర్‌ను రిలీజ్​చేశారు. ఈ సందర్భంగా ఠాక్రే మాట్లాడుతూ.. కేసీఆర్ టైమ్ ​
అయిపోయిందని, కేవలం ఐదు నెలలే ఆయన ప్రభుత్వం నడుస్తుందని మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సర్కార్ తప్పిదాలన్నింటిని బయటకు తీస్తామని పేర్కొన్నారు.

New AICC in-charge for TS on two-day visit from Jan 11

పీసీసీ చీఫ్​రేవంత్ మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ సర్కార్ అరాచకాలను ప్రజలు భరించలేకపోతున్నారన్నారు. రెండు సార్లు అవకాశం ఇచ్చినా.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రగతిభవన్​నుంచి బయటకు తీసుకువస్తామన్నారు. ఫిషరీస్​చైర్మన్​మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​హస్తం గుర్తుతో కార్​గుర్తు టైర్లు, అద్దాలు పగిలిపోతాయని విమర్శించారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్​గవర్నమెంట్ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​సీనియర్ లీడర్​మధుయాష్కీ గౌడ్​తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news