ఏపీలో మరో దారుణం..మైనర్‌పై 5 నెలలుగా అత్యాచారం !

-

మన దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత కఠినంగా వ్యవహరించిన కొందరు దుర్మార్గులు… మహిళలపై దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఏదో ఓ మూలన అత్యాచార ఘటనలు… చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో దారుణం చోటు చేసుకుంది.

తూర్పు గోదావరి జిల్లా మన్యంలో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది. ఐదు నెలలుగా… ఆ బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… రంప చోడవరం మండలం లోని ఓ గ్రామంలో… 14 సంవత్సరాల ఆ బాలిక జీడి మామిడి తోటలో పని చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆ బాలిక పై కన్నేసిన నలుగురు దుర్మార్గులు… ఎలాగైనా వంచించాలని ఆనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అమ్మాయిని బెదిరించి ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఇటీవల… ఆ బాలిక అనారోగ్యానికి గురికావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు నేరుగా వెళ్లి… స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… వారికోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news