టీడీపీ, జనసేన ఉమ్మడిగా ప్రచారం ప్రారంభిస్తే మంచిది : మంత్రి అమర్నాథ్‌

-

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, పవన్ భార్యభర్తల అనుబంధం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన ఉమ్మడిగా ప్రచారం ప్రారంభిస్తే మంచిదని.. దీని వల్ల రెండు పార్టీలకు ఖర్చులు మిగులుతాయని సలహా ఇచ్చారు. వారాహిపై పవన్ ఒక్కడే వస్తారో? చంద్రబాబుతో కలిసి వస్తారో? పవనే నిర్ణయించుకోవాలని అమర్నాథ్ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కు ఆహ్వానం లేదన్నది టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనంటూ అమర్నాథ్ పేర్కొన్నారు. నవంబర్ 25వ తేదీన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందిందంటూ మంత్రి లేఖను లేఖ చూపించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ లోనే గ్లోబల్ ఇండస్ట్రియల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోందని వివరించారు.

ఈ సమ్మిట్ కు దావోస్‌నే ఇక్కడకు తీసుకోచ్చే ప్రణాళికలు చేస్తున్నామంటూ వివరించారు. ముఖ్యమంత్రి జగన్ ముఖం చూసి పెట్టుబడిదారులు ఎవరూ రావడం లేదనే దావోస్ కు ఆహ్వానం అందలేదని వెకిలి ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు. ఐదు సంవత్సరాల పాటు దావోస్ వెళ్లి టీడీపీ ప్రభుత్వం సాధించింది శూన్యమంటూ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news