బీజేపీ ఆట‌లు తెలంగాణ‌లో సాగ‌నీయం : మంత్రి ఎర్రబెల్లి

-

ఢిల్లీ లిక్కర్ అవకతవకల వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం కూడా ఉందనే కామెంట్ల నేపథ్యంలో రగడ కొనసాగుతోంది. బీజేపీ నేతల కామెంట్లకు..టీఆర్ఎస్ పార్టీ అదేస్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ వెంటే మొత్తం తెలంగాణ ప్ర‌జానీకం ఉంద‌న్నారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన ఆ కుటుంబం కోసం ఏ త్యాగానికైనా పార్టీ మొత్తం సిద్ధంగా ఉంద‌ని తేల్చిచెప్పారు మంత్రి ఎర్రబెల్లి. మ‌చ్చ‌లేని కేసీఆర్ కుటుంబంపై బీజేపీ విషం చిమ్ముతుంద‌ని మండిప‌డ్డారు మంత్రి ఎర్రబెల్లి. బీజేపీ ఆట‌లు తెలంగాణ‌లో సాగ‌నీయమ‌ని హెచ్చ‌రించారు. క‌ల్వ‌కుంట్ల క‌విత కుటుంబానికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా సంఘీభావంగా ఉంద‌న్నారు. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో ఎమ్మెల్సీ క‌విత‌ను ఇరికించాల‌నుకోవ‌డం స‌రికాద‌న్నారు మంత్రి ఎర్రబెల్లి.

Call to combat Covid-19 : Errabelli Dayakar Rao

క‌విత జోలికి వ‌స్తే యావ‌త్ తెలంగాణ క‌న్నెర్ర చేస్తుంద‌ని హెచ్చ‌రించారు మంత్రి ఎర్రబెల్లి. క‌విత ఇంటిపై బీజేపీ గూండాలు దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు, మొన్న పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పులలో బండి సంజయ్ బౌన్సర్లు, గూండాలు టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఇవాళ‌ జ‌న‌గామ జిల్లాలో విధ్వంసం సృష్టించ‌డానికి బండి సంజ‌య్ కుట్ర ప‌న్నారు మంత్రి ఎర్రబెల్లి. టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయమని బీజేపీ వాళ్ళను రెచ్చ‌గొట్టి, ఉసి గొల్పాడు. చివరకు పోలీసులనే బెదిరించి, రౌడీయిజానికి దిగాడని మంత్రి ఎర్రబెల్లి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news