నిరుద్యోగ యువత అంటేనే బీజేపీకి చిన్నచూపు : ఎర్రబెల్లి

-

అగ్నిపథ్‌ స్కీంపై మరోసారి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తీరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. అయిన కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు పట్టించుకోకపోవడం చాలా విడ్డూరమని ఆయన వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువత అంటేనే బీజేపీ నాయకులు చిన్నచూపు చూస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 1.40 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ పార్టీకి సిగ్గు లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Take up field visits, ensure vaccine is given to all: Errabelli to babus

డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారాన్నారు. యుద్ధం చేసి సైనికుల చనిపోతే ఆ సిపంతి పై రెండవసారి.. అధికారంలోకి వచ్చిన మోడీ.. సైనికులుగా పని చేద్దాం అన్నా వాళ్ళను మోసం చేస్తున్నాడంటూ ఆయన ధ్వజమెత్తారు. నల్ల చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమించారని, సైనికులు, రైతులను మోసం చేస్తుంది బీజేపీ పార్టీ అని ఆయన విమర్శించారు. రెండేళ్ల పాటు శిక్షణ పొంది రాకేష్ ఊరిలో జాబ్ వస్తాది అని చెప్పుకున్నాడని, ఇప్పటికైనా రాకేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news