అగ్నిపథ్‌పై ఆగ్రహ జ్వాలలు.. మావోయిస్టుల స్పందన ఇలా..

-

ఇటీవల కేంద్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన అగ్నిప‌థ్ స్కీంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘ‌ట‌న‌పై మావోయిస్టులు స్పందించారు. కాల్పుల ఘ‌ట‌న‌ను ఖండిస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర క‌మిటీ కార్య‌ద‌ర్శి జ‌గ‌న్ పేరిట మావోయిస్టులు సోమ‌వారం ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. ఈ లేఖ‌లో ప‌లు కీల‌క అంశాల‌ను ప్రస్తావించిన మావోయిస్టులు… ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి త‌క్ష‌ణ‌మే నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

Sleepwalking' with India's Maoist guerrillas - BBC News

అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని కూడా ఆ లేఖ‌లో డిమాండ్ చేశారు మావోయిస్టులు. సికింద్రాబాద్ కాల్పుల్లో చ‌నిపోయిన రాకేశ్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాల‌ని, బాధితుడి కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని కోరారు మావోయిస్టులు. అంతేకాకుండా కాల్పులు జ‌రిపిన పోలీసుల‌పై హ‌త్యా నేరం కింద కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు మావోయిస్టులు.

 

Read more RELATED
Recommended to you

Latest news