కమ్యూనిస్టుల ప్రచారంతోనే టీఆర్ఎస్ విజయం : జగదీష్ రెడ్డి

-

ఇటీవల ముగిసిన మునుగోడు ఉప ఎన్నికపై హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే. అయితే.. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించగా.. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్ లోని సీపీఐ, సీపీఎం పార్టీల కార్యాలయాలకు వచ్చిన జగదీశ్ రెడ్డి… ఆ పార్టీ నేతలు కూనంనేని సాంబశివరావు, చాడా వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డిలతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసినందుకు కమ్యూనిస్టు పార్టీల నేతలకు వారు ధన్యవాదాలు తెలిపారు జగదీశ్ రెడ్డి.

Jagadish Reddy dares BJP to give Rs 18,000 crore package to Munugode

ఈ సందర్భంగా మాట్లాడిన జగదీశ్ రెడ్డి… మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల ప్రచారంతోనే టీఆర్ఎస్ విజయం సాధించిందని చెప్పారు. భవిష్యత్తులోనూ కమ్యూనిస్టులతో కలిసే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామన్నారు జగదీశ్ రెడ్డి. ఈ ప్రతిపాదనకు సీపీఐ, సీపీఎం నేతలు కూడా సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా తెలంగాణను పెద్ద విపత్తు నుంచి కాపాడామనే సంతోషం తమకూ ఉందని ఈ సందర్భంగా కూనంనేని జగదీశ్ రెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news