మంత్రి కొప్పుల ఎన్నిక వివాదం.. స్ట్రాంగ్ రూమ్ తాళం పగులగొట్టేందుకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్

-

ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక అదేశాలు జారీ చేసింది. స్ట్రాంగ్ రూమ్‌ సీల్ పగులగొట్టి తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్‌కు  అనుమతిచ్చింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ తెరవాలని ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, భద్రత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే వడ్రంగి, లాక్ స్మిత్ సహకారం తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది.

ఆర్‌వోకు డాక్యుమెంట్లు, సీసీ ఫుటేజ్‌ ఇవ్వాలని ఇటీవల ధర్మాసనం ఆదేశించింది. తాళంచెవి సరిపోక స్ట్రాంగ్ రూమ్‌ తెరవలేకపోయినట్టు కలెక్టర్ హైకోర్టుకు తెలిపారు. తాళాల గల్లంతుపై విచారణ జరిపిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలోనే తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.

అసలేం జరిగిందంటే..: జగిత్యాల జిల్లాలో 2018లో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్ట్రాంగ్ రూం తాళాలను తెరిచేందుకు కలెక్టర్​ను ఆదేశించింది. అయితే ఈ క్రమంలోనే ఈనెల 10న జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లగా తాళం చెవులు కనిపించలేదు. దీనిపై మరోసారి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version