బీజేపీ నాయకుల నాలుకలు కోసి..తరిమి తరిమి కొడతాం : మంత్రి కొప్పుల

-

పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారం లో మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన కామెంట్స్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ప్రతి కార్యకర్త ఈ పార్టీలో ఉన్నందుకు గర్వపడాలని పేర్కొన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు ఆ రాష్ట్ర నాయకులు సంక్షేమ ఫలాలు అందించడంలో ఏ ఒక్క రాష్ట్రం సక్సెస్ కాలేదని వెల్లడించారు.

మన తెలంగాణ రాష్ట్రం ప్రజలు కోరుకున్న దానికంటే ఎక్కువే ఇస్తున్న రాష్ట్రమని.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాక ముందు పది సంవత్సరాలు పరిపాలించింది. అప్పుడు టిఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకోలేదు. కానీ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రానున్న రోజుల్లో మీకు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

బిజెపి పార్టీ నాయకులు కేసీఆర్ మీద అ తెలంగాణ మీద ఉచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తాం తరిమి తరిమి కొడతామని వార్నింగ్‌ ఇచ్చారు. కాలేశ్వరం ప్రాజెక్టు తో కోటి యాభై లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంటే బీజేపీ మాత్రం అవినీతి అంటూ తప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తోంది దీన్ని కార్యకర్తలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news