Breaking : నల్గొండ జిల్లా ప్రజలకు ప్రణమిల్లుతున్నాం : మంత్రి కేటీఆర్‌

-

మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేదానికి తెరపడింది. మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయ దుందుభి మ్రోగించారు. అయితే.. ఈ నేపథ్యంలో ఢిల్లీ బాస్‌లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఈ ఆయన మాట్లాడుతూ.. నవంబర్‌ 3న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధికి, ఆత్మగౌరవానికి పట్టంకట్టి కేసీఆర్‌ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానీకానికి పార్టీ తరఫున ప్రజలకు ప్రణమిల్లుతున్నామన్నారు మంత్రి కేటీఆర్‌.

KTR calls Modi icon of partiality

 

ఈ గెలుపులో భాగంగా వేలాదిగా పని చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్‌ మీడియా వారియర్స్‌కు, 40 రోజులుగా పార్టీ అభ్యర్థికి కోసం గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండుకి శిరస్సు వహించి.. పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్‌. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపునకు చాలా గొప్పగా పని చేసి, తమ కార్యకర్తలు, శ్రేణులను అద్భుతంగా నడిపించిన కీలకపాత్ర పోషించిన సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు కూనంనేటి సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్‌రెడ్డి, జాలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, యాదగిరి రావుకు హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news