ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే సంజయ్ పేపర్ లీక్ చేశారు – మంత్రి పువ్వాడ అజయ్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి పువ్వాడ అజయ్. నేడు ఖమ్మం 25వ డివిజన్ మేదర బజార్ లోని బస్తీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బండి సంజయ్ పదవ తరగతి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారని ఆరోపించారు.

రాజకీయ కుట్రలో భాగంగానే పేపర్ లీక్ వ్యవహారం జరిగిందని అన్నారు మంత్రి పువ్వాడ అజయ్. అటు టిఎస్పిఎస్సి లో సైతం బిజెపి కార్యకర్తలే ఉండి.. పోటీ పరీక్షల పేపర్లను లీక్ చేయడం రాష్ట్రానికి పట్టిన పీడ అంటూ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ తెలంగాణకు పట్టిన పీడ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news