ఓయూలో మరో హస్టల్‌ నిర్మాణం.. శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

-

ఇటీవల నిజాం కాలేజీ విద్యార్థులు హాస్టల్‌ కోసం నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఎట్టకేలకు విద్యార్థులకు హాస్టల్‌ కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. తాజాగా.. ఉస్మానియా యూనివర్సిటీలోనూతన హాస్టల్ భవనానికి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, యూనివర్శిటీ వీసీ రవీందర్ పాల్గొన్నారు. క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్థులందరికీ హాస్టల్‌ సదుపాయం కల్పించడం కోసం యూనివర్సిటీలో మరో నూతన హాస్టల్‌ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం రూ.39.50 కోట్లు కేటాయించారు.

Osmania University: ఉస్మానియా వర్శిటీలో  అధునాతన హాస్టల్ నిర్మాణం

క్యాంపస్‌లో 500 మంది విద్యార్థులు ఒకే భవనంలో ఉండే విధంగా కొత్త హాస్టల్ డిజైన్‌ నిర్ణయించారు. జీ+3 అంతస్తులతో దీనిని నిర్మిస్తున్నారు. హాస్టల్‌ భవనం నిర్మించడంతో పాటు ఇంటర్నల్‌ వాటర్‌ సదుపాయం, శానిటరీ విధానం ఏర్పాటు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఇంటర్నల్‌ ఎలక్ట్రికల్‌ను ఇన్‌స్టాల్‌ చేయనున్నారు. ఈ అధునాతన హాస్టల్ ను తొందర్లోనే వినియోగం లోనికి తీసుకువస్తామని ఈ సందర్బంగా మంత్రులు పేర్కొన్నారు. ఈ నిర్మాణ బాధ్యతలు తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అప్పగించినట్లు వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌ యాదవ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news