రైతులకు మోదీ సర్కార్ శుభవార్త..ekyc గడువు పై మరో అప్డేట్..

-

భారత ప్రధాని నరేంద్ర మోదీ రైతుల కోసం ప్రవేశ పెట్టిన స్కీమ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.ఈ పథకం ద్వారా రైతులకు కొంత నగదు సాయాన్ని అందిస్తున్నారు. ప్రతి ఏటా మూడు విడతల చొప్పున 6 వేల రూపాయల నగదును రైతు అకౌంట్లోకి జమ చేస్తుంది. ఇటీవలే 11 వ విడతను జమ చేసింది.అయితే.. 11వ విడత డబ్బులు కొంతమంది అకౌంట్లో జమ కాగా, ఇంకా చాలామంది బ్యాంకు వివరాలు, eKYCని పూర్తి చేయని కారణంగా వారికి 11వ విడత అందించలేదు.

12వ విడత పొందేందుకు ఈ సారి ఖచ్చితంగా eKYC పూర్తి చేసి పంట పెట్టుబడి సాయం పొందాలని, రైతులకు ఉపయోగకరంగా కేంద్ర ప్రభుత్వం eKYC గడువు జూలై 31 వరకు పొడిగించింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడతను కేంద్రం ఇటీవల విడుదల చేసింది.రూ. 21,000 కోట్లకు పైగా నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. 11వ విడతలో eKYC పూర్తి చేయని వారు కనీసం ఇప్పుడైనా పూర్తిచేసి 12వ విడత డబ్బులు పొందాలని ప్రభుత్వం పేర్కొంది.

ekyc ప్రక్రియ కోసం..
* రైతులు CSC కేంద్రాలను సంప్రదించి eKYC ని పూర్తి చేయవచ్చు.
* ఆన్‌లైన్‌లో eKYC కోసం అధికారిక వెబ్‌సైట్ pmkisan.nic.in కు వెళ్ళాలి.
* వెబ్‌సైట్‌ ఫార్మర్స్ కార్నర్‌లో ‘OTP ఆధారిత eKYC’ పై క్లిక్ చేసి ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
* ఆధార్-లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
* తరువాత మొబైల్ నెంబర్‌కు వచ్చిన ‘OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ekyc ప్రక్రియ పూర్తవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news