Breaking : దేశరాజధానిలో మరో మంకీపాక్స్‌ కేసు

-

ఓ వైపు కరోనా వైరస్‌తోనే ప్రజలు అతలాకుతలమవుతుంటే.. ఇప్పుడు మంకీ పాక్స్‌ రూపంలో మరో వైరస్‌ ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే విదేశాల్లో మంకీపాక్స్‌ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న వేళ.. తాజాగా భారత్‌లో కూడా మంకీ పాక్స్‌కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా.. దేశ రాజధాని ఢిల్లీలో మరో మంకీ పాక్స్ కేసు నమోదైంది. కొన్నిరోజుల కింద ఆఫ్రికాలోని నైజీరియా నుంచి వచ్చిన 22 ఏళ్ల యువతికి ఆరోగ్యం బాగోలేకపోవడం, చర్మంపై దద్దుర్లు రావడంతో ఆస్పత్రిలో చేరింది. ఆమె నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించిన వైద్యులు.. ఆమెకు సోకినది మంకీ పాక్స్ వైరస్ అని శనివారం నిర్ధారించారు.

సదరు యువతి నైజీరియా దేశానికి చెందినవారేనని.. ఆమె అక్కడి నుంచి వచ్చే ముందే మంకీ పాక్స్ సోకి ఉంటుందని తెలిపారు అధికారులు. రెండు రోజుల కింద ఢిల్లీలోని ఎల్ ఎన్ జేపీ ఆస్పత్రిలో చేరిందని, తగిన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు అధికారులు. తాజాగా పాజిటివ్ వచ్చిన నైజీరియా యువతితో  కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మంకీ పాక్స్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. వీరిలో ఇద్దరు మహిళలుకాగా, ముగ్గురు పురుషులు.
ఇందులో ఒక వ్యక్తి డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లిపోయారని.. మిగతా నలుగురు ఎల్ఎన్ జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Latest news