ఉత్తరప్రదేశ్ లో ఐదేళ్ల బాలికకు మంకీపాక్స్.!

-

ఉత్తరప్రదేశ్ లో మంకీపాక్స్ కలకలం రేపింది. ఘజియాబాద్ కు చెందిన ఓ ఐదేళ్ల బాలిక మంకీపాక్స్ తో బాధపడుతున్నది. దీంతో అధికారులు ఆమె నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు. తన ఒంటి పై దురద, దద్దుర్లు వస్తున్నాయని వైద్యులను చిన్నారి సంప్రదించిందని ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. కాగా ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏవీ లేవని చెప్పారు. అదే విధంగా ఆమెకు దగ్గరి సంబంధీకులు ఎవరు గత నెల రోజుల్లో విదేశాల్లో పర్యటించలేదని వెల్లడించారు.

అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆమె నుంచి నమూనాలు సేకరించామని అన్నారు. ఆఫ్రికా దేశాల్లో ప్రారంభమైన మంకీ పాక్స్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నది. శుక్రవారం ఒక్క రోజే ఫ్రాన్స్ లో 51 మందికి పాజిటివ్ వచ్చింది. అమెరికాలో ఇప్పటివరకు 21 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే మంకీపాక్స్ రెండు నుంచి నాలుగు వారాల్లో తగ్గిపోతుందని డబ్ల్యుహెచ్వో ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news