ఏ వేదికపై ఏం మాట్లాడాలో బిజెపి నాయకులు నేర్చుకోవాలి – ఎంపీ రంజిత్ రెడ్డి

-

అస్సాం ముఖ్య మంత్రి హిమంత్ బిస్వ శర్మ పై తీవ్ర స్థాయి లో మండి పడ్డారు చేవెళ్ళ ఎం. పి రంజీత్ రెడ్డి. ముఖ్య మంత్రి స్థాయి లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి లో ఉన్నారని ఫైర్ అయ్యారు. బుర్ర పని చేయకుండా మాట్లాడం…..ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ప్రజల‌‌ మద్య చిచ్చు పెట్టడమే లక్యంగా బీజేపీ నాయకులు పూనుకున్నారని మండిపడ్డారు. వేదిక పై బిస్వ శర్మ మాట్లాడిన‌ మటాలను పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు. నేను ఒక్కడినే కాదు ప్రజలంతా ఖండిస్తున్నారని అన్నారు. ఏ వేదిక పై ఏమి‌ మాట్లాడాలో బీజేపీ నాయకులు నేర్చుకోవాలని సూచించారు రంజిత్ రెడ్డి.

గండిపేట మండలం అల్కాపూరీ కాలనీ లో 3.6 కోట్ల తో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ కు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలసి భూమి పూజ చేసారు రంజీత్ రెడ్డి. త్వరలోనే మూడు మునిసిపల్ కార్పొరేషన్ ప్రజల‌ దాహార్తిని ఈ ప్రాజెక్ట్ తీర్చనుందని అన్నారు. ఎన్నో ఎండ్ల నాటి కల సహకారం అయిందన్నారు. ప్రతి ఇంటికి నీళ్ల కుళాయి అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 2.3 ఎమ్ఎల్ కెపాసిటి కలిగిన రిజర్వాయర్ ను 6 నెలల లోపు నిర్మాణం పూర్తి అవుతుందని.. ప్రజలకు అందుబాటులో ఉండి అందరూ కలసి కట్టుతో ‌ముందుకు సాగుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news