నేటి బిగ్ బాస్ షో కు ఎంపీ సంతోష్ కుమార్

-

అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ కు చేరుకుంది. ప్ర‌స్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెట్ లో మాత్ర‌మే ఉన్నారు. అయితే ప్ర‌తి వారం శ‌ని వారం.. ఆది వారం నాగార్జున త‌న హోస్ట్ తో సంద‌డి చేస్తాడు. అలాగే ప్ర‌తి ఆదివారం ఒక గెస్ట్ కూడా వ‌స్తారు. అయితే ఈ వారం బిగ్ బాస్ షో కు గెస్ట్ గా టీఆర్ఎస్ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ వ‌స్తున్నారు. ఆది వారం టెలికాస్ట్ కాబోతున్న ఎపిసోడ్ లో ఎంపీ సంతోష్ కుమార్ క‌నిపించ బోతున్నార‌ని తెలుస్తుంది.

అయితే ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో దేశ వ్యాప్తం గా ఫెమ‌స్ అయ్యారు. అందుక‌నే బిగ్ బాస్ షో లో కి తీసుకురావాల‌ని బిగ్ బాస్ యాజ‌మాన్యం భావించిన‌ట్టు తెలుస్తుంది. కాగ ఆది వారం షో లో హౌస్ నుంచి ఒక్క‌రు ఎలిమినేట్ కాబోతున్నారు. అయితే ఆర్ జే కాజ‌ల్ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version