కెసిఆర్ మీడియాలో నా వార్తలు రానిస్తలేరు: ఈటెల రాజేందర్

-

కెసిఆర్ ను గద్దెదింపేందుకే నిరంతరం పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. వికారాబాద్ జిల్లా తాండూరులో జరుగుతున్న బీజేపీ శిక్షణ తరగతుల్లో ఈటెల రాజేందర్ తో పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఈటెల. నాకు ఫాలోయింగ్ పెరుగుతుందనే తన పేపర్, టీవీలో నా వార్తలు రాకుండా చేశారని గుర్తు చేశారు. ఒక్క కేసీఆర్ మీడియాలో రాకుంటే నష్టం ఏమీ లేదని… ప్రస్తుత రోజుల్లో ప్రతి వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందన్నారు.

యువత తలుచుకుంటే సోషల్ మీడియాలో కెసిఆర్ పనితీరును ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారన్నారు. యువత చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోనే ఏకే 47 లా ఉపయోగపడుతుందన్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని… ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు. మనం చెప్పాల్సింది సమాజానికి ఏది అవసరమో.. చైతన్యం కలిగించేలా ఉండాలని తెలిపారు. ఒకప్పటి కాలం వేరని.. ఇప్పటి జనరేషన్ వేరు అన్నారు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్న ఈటల రాజేందర్. కెసిఆర్ ను గద్దె దింపి తీరుతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news