నల్గొండ జిల్లా ఎల్లమ్మ గూడెం సర్పంచ్ భర్త హత్య కేసును చేదించిన పోలీసులు

-

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం సర్పంచ్ సంధ్యారెడ్డి భర్తని గత శనివారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. పొలం పనులు ముగించుకొని బైక్ పై ఇంటికి వస్తుండగా దుండగులు విజయ్ రెడ్డిని అడ్డగించారు. ముగ్గురి వ్యక్తులు మొదట ఆయన బైక్ ను ఢీకొట్టారు. కిందపడిన విజయ్ రెడ్డి పై కత్తులు, గొడ్డళ్ళతో విచక్షణ రహితంగా నరికేశారు. దీంతో విజయ్ రెడ్డి అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం అతని మృతదేహాన్ని కాలువలో పడేసి వెళ్లిపోయారు దుండగులు.

తాజాగా ఈ హత్య కేసును చేదించారు పోలీసులు. ఎస్పి రమా రాజేశ్వరి సమక్షంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్దనుండి హత్యకు ఉపయోగించిన రెండు గొడ్డల్లు, ఒక సెల్ ఫోన్, ఒక ఫోర్ వీలర్ స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news