6 ఏళ్ల బాలికపై వైసీపీ నేత లైంగిక దాడి.. నారా లోకేష్ సీరియస్

-

 

ఏపీలోని ఓ బాలికపై వైసీపీ పార్టీ కార్యకర్త లైంగిక దాడి కి పాల్పడ్డాడు. ఈ సంఘటన నిన్న వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై టిడిపి అగ్రనేత నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇలాంటి మానవ మృగాలను శిక్షించాలని డిమాండ్ చేశారు. వైకామా పార్టీలో నాయకుల దగ్గర నుండి కార్యకర్తల వరకూ అంతా మహిళల్ని హింసించే వారేనని ఫైర్ అయ్యారు.

 

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక పై అత్యాచారయత్నం చేసాడు వైసిపి కార్యకర్త నరేందర్ రెడ్డి. బాధితురాలు కేకలు వెయ్యడం, చుట్టు పక్కల వారు రావడంతో బాలిక సురక్షితంగా బయటపడిందని తెలిపారు నారా లోకేష్. మూడేళ్ల క్రితం 6 ఏళ్ల బాలిక పై కూడా అత్యాచారయత్నం చేసాడు ఈ కామాంధుడు. బాలికలే టార్గెట్ గా రెచ్చిపోతున్న ఈ వైకామా మృగాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news