బాబాయ్‌ని గొడ్డ‌లి పోటుతో బ‌లిచేసిన‌ట్టే..ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు : నారా లోకేష్

-

జగన్ సర్కార్ పై మరోసారి సంచలన ట్వీట్ చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. బాబాయ్‌ని గొడ్డ‌లి పోటుతో బ‌లిచేసిన‌ట్టేనని.. ప్ర‌జాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారు జ‌గ‌న్‌రెడ్డి అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డ‌బ్బుతో అత్యంత ప‌విత్ర‌మైన ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని జ‌గ‌న్‌రెడ్డి న‌డిబ‌జారులో అంగ‌డి స‌రుకు చేశారని.. టిడిపి నేత‌ల్ని నిర్బంధించి, ఏజెంట్ల‌ని పోలీసులు అరెస్టు చేశారని మండిపడ్డారు.

ys jagan on nara lokesh

ఇత‌ర‌ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని కుప్పం ఎలా రానిచ్చారు? అని ప్రశ్నించారు. వైసీపీ వ‌లంటీర్లే దొంగ ఓట‌ర్ల‌ని బూత్‌ల‌కు తీసుకొస్తుంటే, ఎన్నిక‌ల సంఘం ఏం చేస్తోంది? పోలీసుల ముందే దొంగ ఓట‌ర్లు కాలరెగ‌రేసుకుని వెళ్తూ ఓటేసి వ‌స్తున్నారన్నారు. జ‌గ‌న్ అరాచ‌క‌పాల‌న‌, పెరిగిన ధ‌ర‌లు, పెంచిన ప‌న్నులు, అధ్వాన రోడ్లు, కానరాని అభివృద్ధితో తీవ్ర ఆగ్ర‌హంగా వున్న ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా వ‌చ్చి ఓట్లు వేస్తే దారుణ ఓట‌మి త‌ప్ప‌ద‌ని జ‌గ‌న్‌రెడ్డి తెలుసుకున్నారని ఎద్దేవా చేశారు. డెమోక్ర‌సీ ప‌ద్ధ‌తిలో జ‌ర‌గాల్సిన ఎల‌క్ష‌న్‌ని ఫ్యాక్షనిస్టు క‌నుస‌న్న‌ల్లో జ‌రిగే సెల‌క్ష‌న్ గా మార్చేశారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news