నరసాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ బీజేపీ ఆఫీస్ ముందు ఆందోళన!

-

తెలంగాణ ఎన్నికలు మరో 30 రోజుల్లో జరగనుండగా అన్ని పార్టీలు పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటించాయి. ఇక ఎప్పటిలాగే కొన్ని స్థానాల అభ్యర్థుల విషయంలో అన్ని పార్టీలకు అసంతృప్తి సెగలు రేగడం సహజమే. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం నరసాపూర్ టికెట్ ను మార్చాలంటూ బీజేపీ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఇది చర్చకు దారి తెస్తోంది. గోపి వర్గానికి చెందిన బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు, అదే పార్టీకి చెందిన మురళి యాదవ్ కు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ సందర్భంగా నర్సాపూర్ బీజేపీని కాపాడాలి అంటూ కార్యకర్తలు ప్ల కార్డులు చేతపట్టి నిరసన చేస్తున్నారు.

జై బండి సంజయ్.. బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. గోపి 27 సంవత్సరాలుగా బీజేపీలో ఉంటూ ఆర్ ఎస్ ఎస్ లో పనిచేశాడు.. ఈయన్ను పక్కన పెట్టి మురళీయాదవ్ కు ఎలా సీటిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు. బీజేపీలో ఉన్న కొందరు పెద్దలు వీరికి మద్దతుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లుగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version