హిండెన్ బర్గ్ ఆరోపణలపై అదాని గ్రూప్ కీలక నిర్ణయం

-

హిండెన్ బర్గ్ నివేదిక అదాని గ్రూప్ ను ఎంతగా దెబ్బతీసిందో అందరికీ తెలిసిందే. హిండెన్ బర్గ్ ఆరోపణల నుంచి బయటపడేందుకు తాజాగా అదాని గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో పతనమవుతున్న షేర్ల ధరల్ని కాపాడుకునేందుకు, నష్టాలను ఎదుర్కొనేందుకు స్వచ్ఛందంగా ఆడిట్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రపంచ ప్రసిద్ధ ఆడిట్ కంపెనీ గ్రాంట్ థార్న్టన్ స్థూలంగా జిటి కంపెనీని ఎంచుకుంది.

అయితే ఈ విషయాన్ని అదానీ గ్రూప్ గోప్యంగా ఉంచింది. ఆదాని గ్రూప్ లో సంబంధిత సంస్థల లావాదేవీలు, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని గ్రాంట్ థార్న్ టన్ పరిశీలిస్తుందని సమాచారం. ఈ విషయంపై గ్రాండ్ థార్న్ టన్, ఆదాని గ్రూప్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version