రాహుల్ గాంధీపై మరో కేసు నమోదు

-

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతోపాటు ఎంపీ పదవీ కోల్పోయిన రాహుల్ గాంధీ పై మరో పరువు నష్టం కేసు నమోదయింది. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కోర్టులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా పరువు నష్టం దావా కేసును వేశారు. దీనిపై ఏప్రిల్ 12న కోర్టులో విచారణ జరగనుంది.

మహాభారతంలోని కౌరవులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తో పోలుస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు నమోదయింది. ఆర్ఎస్ఎస్ వారిని 21వ శతాబ్దపు కౌరవులుగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ ఏడాది జనవరిలో తన భారత్ జూడో యాత్రలో భాగంగా ఆర్ఎస్ఎస్ పై ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news