మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో ఆధిక్యంలో బీజేపీ.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్​తో హోరాహోరీ

-

మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్, రాజస్థాన్ శాసనసభలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది . ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా అధికారులు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఆ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ సరళిని చూస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్​లో బీజేపీ సత్తా చాటుతోంది. ఇక ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్, కాషాయ పార్టీ మధ్య హోరాహోరీ పోటీ తలపిస్తోంది.

మరోవైపు మధ్య ప్రదేశ్‌లో ఆధిక్యంలో బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌(116)ను దాటింది. ప్రస్తుతం ఆ పార్టీ 144 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.కాంగ్రెస్‌ 58 చోట్ల.. ఇతరులు 2 చోట్ల ముందంజలో ఉన్నారు. మరోవైపు రాజస్థాన్​లో బీజేపీ అధికారం చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. లీడింగ్​లో ఉన్న స్థానాల సంఖ్య వంద దాటింది. కాంగ్రెస్ 60కి పైగా స్థానాలతో కొనసాగుతోంది. ఇతరులు సుమారు 20 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు. ఛత్తీస్​గఢ్​లో మాత్రం హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ఆధిక్యం కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య దోబూచులాడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version