మోడీ అధ్యక్షతన జరిగే సమావేశానికి చంద్రబాబుకి పిలుపు

-

డిసెంబర్ 5వ తేదీన ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి చంద్రబాబుని ఆహ్వానించారు. ఈ ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి 2023 నవంబర్ 30వ తేదీ వరకు జి20 దేశాల కూటమికి భారత్ అధ్యక్షత వహించనుంది.

ఈ నేపథ్యంలో భారత్ లో నిర్వహించే జీ 20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీ అధ్యక్షులతో ప్రధాని మోదీ చర్చించి సలహాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 5వ తేదీన రాష్ట్రపతి భవన్ లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని చంద్రబాబుకి పిలుపు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news