ఛత్తీస్గఢ్ లో బస్సు బోల్తా..15 మంది దుర్మరణం

-

ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దుర్గ్‌ జిల్లా ఖాప్రి గ్రామ సమీపంలో ఓ బస్సు గొయ్యిలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో సహా మొత్తం 15 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఓ డిస్టిల్లరీ సంస్థ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. పని ముగించుకుని కార్యాలయ బస్సులో ఇళ్లకు తిరిగి వెళ్తుండగా మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారని, 40 అడుగుల భారీ గుంతలో బస్సు పడ్డ వెంటనే 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version