నేడు ఇటలీకి వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

-

PM Modi to visit Italy: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ దేశ పర్యటన ఖరారు అయింది. నేడు ఇటలీకి వెళ్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మూడు రోజులపాటు జరిగే జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇటలీ వెళ్లనున్నారు. ఈ సదస్సులో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు.

PM Modi to visit Italy this week for G7 summit in first trip abroad in third term

ప్రధానితోపాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా, జాతీయ భద్రతాధికారి (ఎన్‌ఎస్‌ఏ) అజీత్‌ డోభాల్‌లతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఇటలీ వెళుతున్నట్లు వెల్లడించాయి.

కాగా, ఈ పర్యటనపై, సదస్సుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తీవ్రవాదం, హింసను సమర్థించే భారత్‌ వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తూనే ఉందని.. ఆ దేశంతో అదే ప్రధాన సమస్య అని భారత విదేశాంగ పేర్కొంది. అటువంటి శక్తులపై ట్రూడో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version