మోడీ సమావేశం : వ్యాక్సిన్ మీద తెలుగు సీఎంలు ఏమన్నారంటే ?

-

రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్ లు పాల్గొన్నారు. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందించే విషయంలో అనుసరించాల్సిన విధానం పై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అభిప్రాయాలని వ్యక్తం చేశారు.

వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇక ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌  తర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి పద్ధతులు అనుసరించాలన్న దానిపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సిన్‌ పంపిణీలో అనుసరించే శీతలీకరణ పద్ధతులు? దానికి ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండాలి? తదితర అంశాలపై దృష్టి పెట్టాలని జగన్ ఆదేశించారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news