జమ్ము కాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్.. 3 AK 47, 2 పిస్టల్స్ స్వాధీనం

-

జమ్ము కాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 3 AK 47, 2 పిస్టల్స్ 9 మగజైన్ 200 రౌండ్స్ తూటాలు సీజ్ చేశారు. అనంతనాగ్ సిటీ లో ఆర్మీ, పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ లో ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారు.
భద్రతా దళాలను పసిగట్టి ఫైరింగ్ ఒపెన్ చేశారు ఉగ్రవాదులు. దీంతో భద్రతా దళాల కాల్పుల్లో సాజీద్ తంత్రాయ్ అనే ఉగ్రవాది హతమయ్యాడు.

గతంలో LET సంస్థ లో పని చేశాడు సాజీద్. ఈ ఉగ్రవాది కాశ్మీర్ లో ఎంతోమంది అమాయకులను పొట్టన పెట్టుకున్నాడు. ఈ ఉగ్రవాదులు జర్నలిస్టులను టార్గెట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు శ్రీనగర్, అనంతనాగ్, కుల్గావ్ జిల్లాలో 10 చోట్ల సర్చ్ ఆపరేషన్స్ లో ఈ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. ఇంకొంతమంది ఉగ్రవాదులు అక్కడే నక్కి ఉన్నట్లు సమాచారం. దీంతో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news