అప్పుడు రాకేశ్ రోషన్.. ఇప్పుడు ఇందిరా గాంధీ.. దీదీకి ఏమైంది..?

-

పశ్చిమ్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తడబడ్డారు. మొన్న రాకేశ్ శర్మ అనబోయి రాకేశ్ రోషన్ అని నెట్టింట ట్రోలింగ్​కు గురైన దీదీ.. ఇవాళ ఇందిరా గాంధీ చంద్రుడిపైకి వెళ్లారంటూ మరోసారి విచిత్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఇందిరా గాంధీ చంద్రుడి వద్దకు చేరుకున్నప్పుడు.. అక్కడి నుంచి హిందుస్థాన్‌ ఎలా ఉందని రాకేశ్‌ను అడిగారు. ప్రపంచంలోనే ఉత్తమంగా ఉందని ఆయన బదులిచ్చారు’ అంటూ ఆమె ఓ కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ అన్నారు. వాస్తవానికి రాకేశ్‌ శర్మ వెళ్లింది అంతరిక్షంలోకి.. కానీ ఆమె మాత్రం చంద్రుడిపైకి అని ప్రస్తావించారు. అందులోనూ.. ఇందిరా గాంధీ చంద్రుడిపైకి వెళ్లారని ప్రస్తావించడం గమనార్హం. దీంతో ఆమె వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇటీవల చంద్రయాన్‌-3 విజయవంతమైన సందర్భంలోనూ మమత.. రాకేశ్‌ శర్మ గురించి ప్రస్తావించారు. అయితే.. రాకేశ్‌ శర్మకు  బదులు.. రాకేశ్‌ రోషన్‌ అని అన్నారు. సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఒక్కసారిగా నెట్టింట ట్రోలింగ్ షురూ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version