ధ‌నుష్‌-శేఖ‌ర్ క‌మ్ముల సినిమా వెన‌క నేచుర‌ల్ బ్యూటీ!

-

ప్ర‌స్తుతం సినిమా ఇండ‌స్ట్రీలో ప్యాన్ ఇండియ‌న్ మూవీల హవా న‌డుస్తోంది. ఒక భాష‌కు చెందిన హీరోల‌తో మ‌రో భాష‌కు చెందిన డైరెక్ట‌ర్లు మూవీలు ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో టాలీవుడ్‌లోనే క్లాసిక‌ల్ హిట్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఓ అరుదైన కాంబినేష‌న్ సెట్ చేసుకున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్‌తో ఓ ప్యాన్ ఇండియ‌న్ మూవీ చేయ‌బోతున్నాడు.


దాదాపు ఎవరూ ఊహించనిది ఈ కాంబో అని చెప్పాలి. వీరిద్ద‌రి కాంబోలో సినిమా అంటూ రీసెంట్‌గా అధికారిక ప్రకటన రావడంతో అందరూ ఆశ్చ‌ర్య‌పోయార‌నే చెప్పాలి. ఇదే మ్యాట‌ర్ నిన్నటి నుంచి ఇటు మీడియాతో పాటుగా అటు సోషల్ మీడియాలో కూడా తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

అయితే ఇప్పుడు వీరి కాంబో గురించి ఓ క్రేజీ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే ఇండ‌స్ట‌రీలోనే నేచురల్ బ్యూటీగా గుర్తింపు పొందిన సాయి పల్లవి ధ‌నుష్‌తో సినిమా చేయ‌డానికి ఒప్పించింద‌ని తెలుస్తోంది. ఎందుకంటే శేఖ‌ర్ క‌మ్ములకు సాయిప‌ల్ల‌వికి ద‌గ్గ‌రి స‌న్నిహిత్యం ఉంది. ఆ కార‌ణంతోనే ధ‌నుష్‌తో సినిమా ఒప్పించిందంట‌. ఏదేమైనా ఒక హీరోయిన్ ఇలా మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయ‌డం మంచిదే క‌దా.

Read more RELATED
Recommended to you

Latest news