“డీజే టిల్లు” హీరోయిన్ పుట్టుమచ్చలపై ప్రశ్న..రిపోర్టర్‌ పై నేహా శెట్టి సీరియస్‌ !

-

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తాజా సినిమా డీజే టిల్లు. అట్లే ఉంటది మనతోనే అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను pdv ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా ట్రైలర్‌ నిన్న విడుదల అయింది.

ఈ ట్రైలర్ లాంచ్ నేపథ్యంలో ఈవెంట్ నిర్వహించింది చిత్రబృందం. ఈ ఈవెంట్ లో హీరో సిద్దు, హీరోయిన్ నేహా శెట్టి కి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ సినిమా ట్రైలర్ లో “నీ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయని సిద్ధూ.. నేహా శెట్టీని రొమాంటిక్ సీన్లు అడుగుతాడు. దీనికి నేహా శెట్టి 16 అని సమాధానం ఇస్తుంది. అయితే దీనిపై రిపోర్టర్ మాట్లాడుతూ… సిద్దు కు అసభ్యకరమైన ప్రశ్న సంధించాడు. ట్రైలర్ లో హీరోయిన్ పుట్టు మచ్చల గురించి అడిగాడు.

రియల్ గా కూడా ఆమెకు పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నారా అని ప్రశ్నించాడు రిపోర్టర్. దీనితో కంగుతిన్న హీరో సిద్దు… ఆ ప్రశ్న ను అవాయిడ్ చేశాడు. అయితే దీనిపై నేహా శెట్టి తన ట్విట్టర్ వేదికగా సీరియస్ అయ్యారు. “ఇలాంటి ప్రశ్న అడగడం చాలా దురదృష్టకరం. కానీ సిద్దు ఇచ్చిన సమాధానం అతడిపై గౌరవం మరింత పెంచింది. తమ ఇంట్లో కానీ.. వర్క్ ప్లేస్ లో కాని మహిళలకు సింధు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు.” అని రిపోర్టర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇది దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news