సంచలనం రేపిన “ఖలీల్ హత్య” ముడి వీడింది .. భార్య పిల్లలే దారుణంగా !

-

నెల్లూరు టౌన్ లోని శివగిరి కాలనీ లో ఆగష్టు 3వ తేదీన ఖలీల్ అనే వ్యక్తి ఇంట్లోనే మరణించి ఉండడంతో పోలీసులు కేసు నందు చేసి దర్యాప్తు చేశారు…ఈ కేసులో సొంత భార్య మరియు పిల్లలే ఈయనను కొట్టు కొట్టి చంపినట్లు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఖలీల్ అనే వ్యక్తికి భార్య మరియు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇక ప్రతి కుటుంబంలో లాగే వీరి కుటుంబంలోనూ కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయి.. ఆస్తిని ఖలీల్ తన రక్తం పంచుకుపుట్టిన అన్నాతమ్ములకు ఇవ్వడానికి ఆసక్తిని చూపించడంతో ఇంట్లో కొన్ని రోజులుగా భార్య మరియు పిల్లలతో గొడవలు జరుగుతున్నాయి. ఇక ఇంతకీ ఖలీల్ వినకపోవడంతో అతన్ని కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఇంట్లోనే ఉండేలా చేయాలనీ భార్య మరియు ముగ్గురు కుమారులు ఆలోచించారు.

ఆ పధకంలో భాగంగానే ఆగష్టు 3వ తేదీన అందరూ కలిసి ఖలీల్ ను కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇప్పుడు ఈ మృతికి కారణం అయిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version