నిఖిల్ రేంజ్ పెరిగింది..‘కార్తీకేయ-2’ హక్కుల కోసం అన్ని కోట్ల?

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన ‘కార్తీకేయ’ పిక్చర్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. కాగా, ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్నా ‘కార్తీకేయ-2’పైన కూడా అంతటి రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. యంగ్ హీరో నిఖిల్ సినిమాలకు అంతకంతకు రేంజ్ పెరుగుతున్నదని ఈ సందర్భంగా చెప్పొచ్చని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తీకేయ-2’ ఫిల్మ్..నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

వచ్చే నెల 22న తెలుగు, హిందీ, తమిళ్ తో పాటు మలయాళ, కన్నడ భాషల్లో ఈ పిక్చర్ రిలీజ్ కానుంది. అనుపమా పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా..థియేట్రికల్ రైట్స్ కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.15 కోట్లపైనే ధర పలుకుతుందని టాక్. అలా..నిఖిల్..రేంజ్ పెరిగిందని మేకర్స్ చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news