అప్పుడు పవన్..ఇప్పుడు నితిన్..ఆ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ప్రతీ సినిమాలో పవన్ కల్యాణ్ గురించి ఏదో ఒక విషయంలో ఇమిటేట్ చేస్తుంటాడు యూత్ స్టార్ నితిన్. నితిన్ ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సీరియస్ ఫిల్మ్ చేస్తున్నారు.

ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ పిక్చర్ పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత నితిన్ ప్రముఖ రచయిత ‘నా పేరు సూర్య…నా ఇల్లు ఇండియా’తో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత నితిన్..‘భీమ్లా నాయక్’ ఫేమ్ సాగర్.కె.చంద్ర దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ వార్త తెలుసుకుని పవన్ అశేష అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఇప్పుడు పవన్ అభిమాని నితిన్ ను డైరెక్ట్ చేయడానికి సాగర్.కె.చంద్ర ప్లాన్ వేసకున్నారా అని హ్యాపీగా ఫీలవుతున్నారు. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన డైరెక్టర్ సాగర్ కె.చంద్ర..డెఫినెట్ గా ఫ్యూచర్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అవుతారని  పవన్ అభిమానులు అంటున్నారు. త్వరలో ఈ సినిమా విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. చూడాలి మరి..ఏమవుతుందో..

Read more RELATED
Recommended to you

Exit mobile version