ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్..SSMB28లో సెకండ్ హీరోయిన్ ఎవరంటే?

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఫ్యామిలీతో ప్యారిస్ ట్రిప్ లో ఉన్న మహేశ్..ఇండియాకు రాగానే తన స్నేహితుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు.

వీరిరువురి కాంబోలో ఇది హ్యాట్రిక్ ఫిల్మ్. కాగా, ‘SSMB28’పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ఫాదర్ కన్నడ సీనియర్ హీరో రవిచంద్రన్ నటించబోతున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. కాగా, తాజాగా వస్తున్న వార్తల ప్రకారం..ఈ పిక్చర్ లో సెకండ్ హీరోయిన్ గా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ను సెలక్ట్ చేశారని టాక్.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రతీ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ తో పాటు సెకండ్ హీరోయిన్ పైన ఫుల్ ఫోకస్ పెడుతుంటారు. పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో ప్రణీత..‘భీమ్లానాయక్’లో సంయుక్త మీనన్, ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో అదా, ‘అరవింద సమేత’లో ఈషా రెబ్బా, ‘అలవైకుంఠపురములో’లో నివేదా పేతురాజ్..ఇలా ప్రతీ చిత్రంలో రెండో కథానాయికకు ప్రయారిటీనిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మహేశ్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్ SSMB28లో రెండో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news