Breaking : కేసీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చిన నీతి ఆయోగ్‌

-

నీతి ఆయోగ్ భ‌జ‌న సంస్థ‌గా మారింద‌ని, దేశంలోని రాష్ట్రాల‌కు కేంద్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన
వ్యాఖ్య‌ల‌పై చాలా వేగంగానే కాకుండా ఘాటుగా స్పందించింది నీతి ఆయోగ్. ఆదివారం జ‌ర‌గనున్న నీతి ఆయోగ్ భేటీకి
హాజ‌రుకాకూడ‌ద‌ని కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది నీతి ఆయోగ్. అజెండా రూప‌క‌ల్ప‌న‌లో రాష్ట్రాల‌ను ప‌క్క‌న‌పెట్టార‌న్న కేసీఆర్ ఆరోప‌ణ‌లు అర్ధ‌ర‌హితన్న నీతి ఆయోగ్‌.. గ‌డ‌చిన ఏడాదిలోనే సీఎంల‌తో 30 స‌మావేశాలు నిర్వ‌హించిన‌ట్లు తెలిపింది నీతి ఆయోగ్. స‌మాఖ్య స్ఫూర్తి బ‌లోపేతం కోస‌మే ఈ సంస్థ ఏర్పాటు అయిన‌ట్లు నీతి ఆయోగ్ తెలిపింది నీతి ఆయోగ్.

National Institution for Transforming India (NITI) Aayog: Composition and  Objectives

అజెండా త‌యారీలో రాష్ట్రాల‌ను సంప్ర‌దించ‌డం లేద‌న్న మాట‌ల్లో వాస్త‌వం లేదని స్ప‌ష్టం చేసింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ప‌నితీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోప‌ణ‌లు స‌రికాదని, రాష్ట్రాల‌కు కేంద్రం అన్నిర‌కాలుగా ఆర్థిక స‌హ‌కారం అందిస్తోందని కూడా వెల్ల‌డించింది నీతి ఆయోగ్. కేంద్ర ప్ర‌భుత్వ ప్రాయోజిత ప‌థ‌కాల కేటాయింపులు 2015-16లో రూ.2.03.740 కోట్లు ఉండ‌గా.. 2022-23 ఏడాదికి రూ.4,42,781 కోట్లకు పెరిగిన‌ట్టు తెలిపింది నీతి ఆయోగ్. జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద తెలంగాణ‌కు రూ.3,982 కోట్లు కేటాయిస్తే… తెలంగాణ కేవ‌లం రూ.200 కోట్లు మాత్రమే తీసుకుందని, పీఎంకేఎస్‌వై- ఏబీపీ స్కీం కింద రూ.1,195 కోట్లు విడుద‌ల చేశామ‌ని వెల్ల‌డించింది నీతి ఆయోగ్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news