తెలంగాణాలో 18 ఏళ్ళు దాటిన వారికి వాక్సిన్ ఇవ్వడంలేదు: ప్రభుత్వం

-

తెలంగాణాలో తమకు లాక్ డౌన్ విధించే ఆలోచనే లేదని మంత్రి ఈటల రాజేంద్ర స్పష్టం చేసారు. 18 ఏళ్ళు నిండిన వారికి తెలంగాణాలో మే 1 నుంచి వాక్సిన్ ఇవ్వడం లేదని ఆయన ప్రకటించారు. మే 1 నుంచి 18 ఏళ్ళు దాటిన వారికి వాక్సిన్ ఇవ్వాలి అంటే 3.5 కోట్ల డోస్ లు కావాలని ఆయన అన్నారు. కేంద్రం కేటాయించే వాక్సిన్ ల బట్టే తెలంగాణాలో వాక్సినేషన్ జరుగుతుందని అన్నారు.

minister etala

కొన్ని విషయాల్లో కేంద్ర స్పందన ఏ మాత్రం బాగా లేదని ఆయన పేర్కొన్నారు. ఎక్కువ ధరకు కరోనా మందులను విక్రయించే వారిపై కఠినంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఆక్సీజన్ సరఫరాను కేంద్రం నియంత్రించడం కాదు రాష్ట్రాల కొరత తీర్చాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version