రైతులు ఎవ్వరూ ఆ పని చేయకండి.. కేటీఆర్ కీలక సూచన

-

కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. కేటీఆర్ గురువారం ఆయన సొంత నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని.. మీకు మేము, కేసీఆర్ ఉన్నారని ధైర్యం చెప్పారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని మండిపడ్డారు. గతేడాది ఇదే సమయానికి కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్లు ఇచ్చామని గుర్తు చేశారు.

కేసీఆర్ పై కోపంతో ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లను రిపేర్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు లేక, అకాల వర్షాలకు పంట నష్ట పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. సీఎం రేవంత్ రెడ్డికి రైతులను పరామర్శించే సమయం లేదని విమర్శించారు. రైతు బంధు స్కీమ్ కోసం ఎన్నికలకు ముందు కేసీఆర్ రూ.7 వేల కోట్లు పెట్టిపోతే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని కాంట్రాక్టర్లకు ఇచ్చిందని ఆరోపించారు. నీళ్లు లేక, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news