Breaking : డోంట్‌ వర్రీ సమంత.. మనో ధైర్యంతో ఉండు : ఎన్టీఆర్‌

-

సమంత.. ఇండియన్‌ సినిమాలో ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక స్టార్‌ హీరోయిన్‌గా దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే.. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ అందరిని ఎంతో మోటివేట్‌ చేసే సమంత ప్రస్తుతం తన జీవితంలో గడ్డుకాలాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఒక అరుదైన, ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నట్లు సమంత వెల్లడించి అందరినీ షాక్‌కు గురి చేసింది. సమంత పోస్ట్‌ చూసి యావత్‌ సినీ ప్రపంచం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది.

తన అనారోగ్యం గురించి నటి సమంత ఓపెన్ అయ్యింది. మయోసిటిస్‌ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. ఆరోగ్యం నిలకడగానే ఉందని.. త్వరలోనే కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చేతికి సెలైన్‌‌ ఎక్కుతుండగా.. యశోద సినిమాకు డబ్బింగ్ చెబుతూ ఆమె ఈ పోస్ట్ చేసింది. దీంతో సెలబ్రిటీలు అందరూ స్పందిస్తున్నారు. సమంతా త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ధైర్యంగా ఉండాలని సూచించారు.

అటు హీరోయిన్స్ కాజల్, శ్రీయ, అనుష్క, అతియా శెట్టి, రుహాని శర్శ, మాళవిక నాయర్, రాశీ కన్నాలతో పాటు మంచు లక్ష్మీ, సుస్మిత కొణిదెల సోషల్ మీడియా వేదికగా సమంతకు ధైర్యం చెప్పారు. స్ట్రాంగ్‌గా ఉండాలని సూచించారు. కాగా తన వ్యాధి గురించి పెట్టిన పోస్ట్‌ను ఉద్వేగ భరింతంగా రాసుకొచ్చారు సమంత. జీవితం తనకు అనేక సవాళ్లు విసురుతోందని, అదే సమయంలో ప్రేక్షకులు చూపే ప్రేమ వాటిని అధిగమించే శక్తిని ఇస్తోందని పోస్ట్‌ చేశారు. కొన్ని నెలల క్రితం తనకు ప్రాణాంతకమైన మయోసిటిస్‌ అనే వ్యాధి ఉందనే విషయం తెలిసిందని వెల్లడించారు. ప్రస్తుతం అది తగ్గుముఖం పట్టిందని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే తాను పూర్తిగా కోలుకోగలనని డాక్టర్లు చెప్పారని సమంత పోస్ట్ చేశారు. కాని కోలుకునేందుకు ఊహించిన దానికన్నా ఎక్కువ సమయం పడుతోందని అన్నారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు తాను కష్టపడుతున్నానని ఆమె అన్నారు, భౌతికంగానూ, మానసికంగానూ తనకు మంచి రోజులు, దుర్దినాలు ఉన్నాయని ఒకింత ఆవేదనను ఈ పోస్టులో సమంత షేర్‌ చేశారు. రికవరీకి తాను కొన్ని అడుగుల దూరంలోనే ఉన్నానని సమంత అన్నారు. నవంబర్‌ రెండు నుంచి యశోదా సినిమా ప్రమోషన్‌ యాక్టివిటీస్‌లో సమంత పాల్గొనే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version