Breaking: టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్‌.. ఈ సారి ఫుడ్‌ సెఫ్టీ విభాగంలో

-

తెలంగాణ సర్కార్‌ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. అయితే నేడు తాజాగా మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. రాష్ట్రంలో ఫుడ్సఫ్టీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 పోస్టులను జనరల్ రిక్రూట్ మెంట్ కింద భర్తీ చేయనుంది టీఎస్పీఎస్సీ. ఈ నెల 29 నుంచి ఆన్ లైన్లో అప్లికేషన్లను స్వీకరించనున్నారు అధికారులు. ఆగస్టు 26 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు అధికారులు. దీనికి సంబంధించిన వివరాలను టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో అప్లోడ్ చేశారు టీఎస్పీఎస్సీ అధికారులు.

Candidates can change nativity, education for jobs: TSPSC

టీఎస్ పీఎస్సీ పాలకవర్గం సమావేశం గురువారం కమిషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాళీల భర్తీ, గ్రూప్ -4 జాబితాపై చర్చించారు. అయితే, ఇప్పటికే జాబితా అందిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని తీర్మానించారు అధికారులు. దీంతో గురువారం సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది టీఎస్పీఎస్సీ. గ్రూప్ -4 జాబితాపై త్వరలోనే ఆయా శాఖల ఉన్నతాధికారులతో
సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

 

Read more RELATED
Recommended to you

Latest news