కేసీఆర్ పాల‌నను అంతం చేసేందుకే పాద‌యాత్ర : బండి సంజ‌య్

-

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాల‌న‌ను అంద‌మొందించ‌డానికే పాద‌యాత్ర చేస్తున్న‌ట్టు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ దే విజ‌యం అని దీమా వ్య‌క్తం చేశారు. కాగ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ ప్రజా సంగ్రామ యాత్ర లో భాగంగా గురు వారం నుంచి రెండో విడ‌త పాద‌యాత్ర చేస్తున్నారు. గురు వారం జోగులంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ శక్తి పీఠంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం పాద‌యాత్ర ప్రారంభించారు. ఆలంపూర్ నుంచి ఇమామ్ పూర్ వ‌ర‌కు దాదాపు నాలుగు కిలో మీట‌ర్ల మేర మొద‌టి రోజు పాద‌యాత్ర చేశారు.

అనంత‌రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో బండి సంజ‌య్ మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక కేసీఆర్ అంతు చూస్తామ‌ని అన్నారు. గ‌డీలు బ‌ద్ద‌లు కొడుతామ‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు అండ‌గా ఉంటే.. రెండో ద‌శ పాద‌యాత్ర‌ను పూర్తి చేస్తాన‌ని అన్నారు. అంబేద్క‌ర్ జ‌యంతి వ‌స్తే.. ముఖ్య‌మంత్రి క‌నీసం బ‌య‌ట‌కు కూడా రాలేద‌ని మండిప‌డ్డారు. వ‌రి వేస్తే ఉరే అని చెప్పిన సీఎంతో వ‌రి ధాన్యం కొనుగోలు చేయిస్తున్న ఘ‌న‌త బీజేపీదే అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news