బిడ్డను కనాలని కొడుకు ,కోడలు పై కేసు వేసిన తల్లిదండ్రులు

-

మనవడినో, మనవరాలునో కనాలని కొడుకు, కోడలిపై కేసు వేశారు తల్లిదండ్రులు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో జరిగింది. సంవత్సరంలోగా మనవడో, మనవరాలినో కనాలని, లేకుంటే ఐదు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఓ దంపతులు కోర్టుకెక్కారు. హరిద్వార్ కు చెందిన ఓ జంట 2016లో తమ అబ్బాయికి పెళ్లి చేశారు. అయితే ఇప్పటిదాకా వారు పిల్లల్ని కనలేదు. అందుకే ఆ తల్లిదండ్రులు తమ కొడుకు పై కేసు వేయాలి అనుకుంటున్నారు. ఎస్ ఆర్ ప్రసాద్ అనే పెద్దాయన తన దగ్గర ఉన్నది అంతా తమ అబ్బాయి కోసమే ఖర్చు చేశాడు.

అమెరికాలో చదివించి ఘనంగా పెళ్లి కూడా చేశారు. బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టించారు. ఇప్పుడు తమ దగ్గర పైసా కూడా లేదని, ఆర్థికంగా చితికిపోయామని, అందుకే తమ కొడుకు పై ఇలా కేసు పెట్టామని ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే తన కొడుకు తనను పట్టించుకోలేదని, అందుకే మనవడో, మనవరాలో కావాలని కేసు వేయడం వెనుక వాళ్ల ప్రధాన ఉద్దేశం ఉందని తల్లిదండ్రుల తరపున వాదిస్తున్న న్యాయవాది లాయర్ శ్రీవాత్సవ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news